మిట్టపల్లి పదవి కి బ్రేక్​..

సిరిసిల్ల న్యూస్​:

తెలంగాణ ఉద్యమ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్​కు కార్పోరేషన్​ పదవి..?

ఎన్నికల  నోటీఫీకేషన్​ తో మిట్టపల్లి పదవికి తాత్కాలిక బ్రేక్​

మిట్టపల్లి సురేందర్​కు రాష్ట్ర స్థాయి పదవి కోసం కేసీఆర్​, కేటీఆర్​, హరీష్​రావు సుముఖం

తెరవెనక చక్రం తిప్పిన బాల్క సుమన్​.. అంతలోనే ఎన్నికల నోటీఫీకేషన్​

పార్టీ కోసం పని చేయండి నేనున్న ఏపూరి సోమన్నకు, మిట్టపల్లి సురేందర్​కు మంత్రి కేటీఆర్​ సూచన

సిరిసిల్ల హెలిక్యాప్టర్​ ప్రయాణం గాలిలోనే దశ తిరిగే సమయంలో ఎన్నికల షెడ్యూల్​

తెలంగాణ ఉద్యమ పాట రచయిత, ప్రముఖ సీని గేయ రచయిత మిట్టపల్లి సురేందర్​ రాష్ట్ర స్థాయి పదవికి ఎన్నకల షెడ్యూల్​ తో బ్రేక్​ పడినట్లు అయ్యింది. టీఆర్​ఎస్​ పార్టీ అవిర్బావం నుంచి బీఆర్​ఎస్​ వరకు మిట్టపల్లి సురేందర్​ పార్టీకి సేవలు అందించడమే కాకుండా అనేక పాటలు రాసి, పాడి తెలంగాణా ప్రజల మన్ననలు పొందారు. అనేక అవార్డులు అందుకున్నారు. తెలంగాణా నుంచి సీని ఇండస్ట్రీలో సైతం రాణిస్తున్నారు. ఉద్యమ గాయకుడు సాయిచంద్​ మరణం తర్వాత బీఆర్​ఎస్​కు ఆ స్థాయిలో పార్టీ కార్యక్రమాలకు పాటలు పాడే గాయకులు లేకుండా పోయారు. ఈ క్రమంలో ప్రభుత్వ విఫ్​ బాల్క సుమన్​, ఎంఎల్​సీ దేశపతి శ్రీనివాస్​ లు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా గళం విప్పుతున్న ఏపూరి సోమన్నతో చర్చలు జరిపి బీఆర్​ఎస్​ లో చేర్చుకున్నారు. ఎన్నికల సమయంలో ధూం ధాం వేదికలకు ఇన్​చార్జీగా ఇస్తామన్న కమిట్​మెంట్​, భౌవిష్యత్​ మంచి రాజకీయ భౌవిష్యత్​ ఉంటుందని మంత్రి కేటీఆర్​ హమీ ఇప్పించి పార్టీలోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే ప్రముఖ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్​ అలకబూనడంతో.. చెన్నూర్​ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ కల్పించుకోని సీఎం కేసీఆర్​, మంత్రులు హరీష్​రావు, కేటీఆర్​ దృష్టికి మిట్టపల్లి సురేందర్​ విషయం తీసుకెళ్లడంతో రాష్ట్ర స్థాయి కార్పోరేషన్​ పదవి ఇచ్చేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఏపూరి సోమన్న జాయినింగ్ రోజు మంత్రి కేటీఆర్​ కానీ, ఎంఎల్​సీ కవిత కానీ హజరుకాకపోవడంతో కాస్తా అనుమానంతో ఉన్న ఏపూరి సోమన్నను, మిట్టపల్లి సురేందర్​ ను బాల్క సుమన్​ సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్​ను కల్పించినట్లు సమాచారం.అనుకోకుండా మంత్రి కేటీఆర్​ వీరద్దరిని హెలిక్యాప్టర్​ లో ఎక్కించుకోని గాలిలోనే వారి భౌవిష్యత్​ భరోసాను మంత్రి కేటీఆర్​ ఇచ్చినట్లు తెలిసింది. మిట్టపల్లి సురేందర్​కు రాష్ట్ర స్థాయి పదవి ఎన్నికలకు ముందే ఇస్తామని, సీఎం కేసీఆర్​ ఆరోగ్యం బాగులేకపోవడంతో రెండు మూడు రోజుల్లో ఉత్వర్వులు ఇచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్​ చెప్పినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్​ హమీతో ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్​ లు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నెల 10నుంచి 13 లోగా ఎన్నికల షెడ్యూల్​ వస్తుందని అంచానా వేయగా కేంద్ర ఎన్నికల కమీషన్​ సోమవారమే ఎన్నికల నోటీపీకేషన్​ వేయడంతో కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్​ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. బీఆర్​ఎస్​ మరోసారి అధికారంలోకి వస్తే.. మొదటి విడతలోనే వేములవాడ బీఆర్​ఎస్​ నేత ఎనుగు మనోహర్​ రెడ్డి, మిట్టపల్లి సురేందర్​కు కార్పోరేషన్​ పదవులు వస్తాయని బీఆర్​ఎస్​ శ్రేణులు పేర్కొంటున్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş