– నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 164 దరఖాస్తులు రాగ, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులు సత్వరంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
