బలగం టీవీ, హైదరాబాద్:
కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో గల సాయిబాబా ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సాధు ప్రతాప్ రెడ్డి ఆహ్వానం మేరకు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ హాజరై, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా ఆశీర్వాదం పొందారు.
ఈ కార్యక్రమంలో బండి రమేష్ మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించామని,సాయిబాబా ఆలయ వార్షికోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించడంతో పాటు, సమాజంలో సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించే కార్యక్రమంగా నిలిచిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ పుష్ప రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజపుత్, మధు గౌడ్, మేకల రమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, కాంగ్రెస్ యూత్ నాయకులు శివా చౌదరి, రమణ, బి బ్లాక్ అధ్యక్షురాలు సంధ్య, మహిళా అధ్యక్షురాలు రజిత, జ్యోతి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.



