బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 25 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన గులాబీ పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన గులాబీ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ ఉద్యమ తొలిదశలో 360 మంది విద్యార్థులను కాల్చి, ఇనుప బూట్లతో తొక్కి అణిచివేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కెసిఆర్ చేతిలో పెట్టారు కాబట్టే, రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈ నెల 27న వరంగల్లో జరిగే బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అన్నారు.