బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
పదేండ్ల కేసీఆర్ పాలన.. తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చింది..
కేసీఆర్ అనే మూడు అక్షరాల పదమే లేకుంటే.. బక్కపలచని మనిషి.. తెలంగాణా రాష్ట్రం కోసం జెండా పట్టకపోతే..
నేటి పరిస్థితి తెలంగాణ ది సమైఖ్య ఆంధ్రాలో ఎలానో ఒక్కసారి ఆలోచన చేయాలి..
సాగునీరేమో కానీ తాగునీరు కరువు నాటి తెలంగాణాలో..
గుక్కెడు నీళ్లు కోసం గుక్కపట్టి ఏడ్చిన రోజులు.. వాటర్ ట్యాంకుల వద్ద, చేతిపంపుల వద్ద ఆడబిడ్డలు సికెంటుకలు పట్టుకొని కొట్టుకొని బిందెడు నీళ్ల కోసం పానిపట్టు యుద్దాలు చేసిన రోజులవి..
కరెంటు కష్టాలు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నల ఆత్మహత్యలు.. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడో పోతుందో తెలియని చీకటి రోజులు.. అర్థరాత్రి కరెంటుకు పాముకాట్లకు రైతులు అసువులు బాసిన ఆ రోజులను ఇప్పటికి మరిచిపోలేను.. యూరియ బస్తా కోసం పోలీస్ స్టేషన్ల ముందు బారులు తీరి.. ప్రాణాలిడిసిన రైతులు.. నేను 23 ఏండ్లుగా జర్నలిస్టుగా రాజన్న సిరిసిల్ల లో వివిధ పత్రికల్లో పని చేసిన.. కరువు కటకాలు చూసిన.. అనుభవించిన.. ఆ వార్తాలను రాసిన.. తెలంగాణాకు ముందు, తెలంగాణ తర్వాత నేను బేరిజు వేసుకున్నాను. మన రాష్ట్రం మనం ఏలుకునే రోజులోచ్చాయి.. మన నాయకులు ఆంధ్రా నాయకుల వద్ద చేతులు కట్టుకొని ఐదు, పది లక్షల నిధుల కోసం అడిగే రోజులు పోయి మన పైసలు మనమే మంజూరు చేసుకునే రోజులొచ్చాయి. ఆత్మగౌరవం లభించింది. ఎక్కడికో నేను పోను.. పదేండ్ల ముందు మా సిరిసిల్ల.. పదేండ్ల తర్వాత సిరిసిల్ల ను నేను అభివృద్దికి కొలామానం వేస్తాను. మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల లో కరువుతో రైతున్నలు ఆత్మహత్యలకు పాల్పడితే.. ఉపాధీ కరువై గల్ప్ పట్టిన యువత.. వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో.. నేతన్నలు వందల సంఖ్యలో ప్రాణాలు తీసుకున్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత.. సిరిసిల్ల రూపు రేఖలు మారిపోయాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి.. తిన్న రేవు తలవాలి.. కేసీఆర్ తనయకుడు కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే కాకపోయింటే కూడా ఈ మాత్రం సిరిసిల్ల అభివృద్ది కాకపోవు అనుకుంటాను.
సిరిసిల్ల ఎటు చూసిన రెండు కిలో మీటర్లు పోడవు ఉండకపోవు కానీ ఇప్పుడు 10 కిలో మీటర్ల వరకు పట్టణం విస్తరించింది. ఎటు చూసిన బైపాస్రోడ్డులు, ఫోర్ లైన్లు, పరిశ్రమలు, ఇంజనీరింగ్, డిగ్రి, ఇంటర్ కళాశాలలు, మౌళిక వసతుల మెరుగు అయ్యాయి. బతుకమ్మ చీరలతో సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు నిలిచిపోయాయి. వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. ప్రతి మనిషిలో కొనుగోలు శక్తి పెరిగింది. కరువు ప్రాంతమైన సిరిసిల్ల కాళేశ్వరం జలాలతో.. మిడ్ మానేరు నిర్మాణం పూర్తితో శాస్యశామలం అయ్యింది. 9వ ప్యాకేజి పనుల పూర్తితో సిరిసిల్ల జిల్లా లో వేల ఎకరాలు భూమికి శాశ్వాత సాగునీరు అందనుంది. తెలంగాణా ఏమొచ్చింది అంటే.. బానిస సంకేళ్లు పోయి .. ఆత్మగౌరవం వచ్చింది అని చెప్పాలి. స్వయం పాలన వచ్చిందని చెప్పుకొవాలి. సాగు, తాగునీరు కష్టాలు పోయినయి అని చెప్పాలి.. ఆత్మహత్యలు ఆగిపోయాయని చెప్పాలి. అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతూ ప్రపంచ పటంలో మన తెలంగాణ వెలుగుతుందని చెప్పాలి. ఏ ప్రభుత్వం ఐన లోటు పాట్లు, మంచి చెడులు ఉండోచ్చు కానీ.. కేసీఆర్ అనే ఒక శక్తి.. తెలంగాణ జెండా పట్టకపోతే.. ఆంద్రాపెత్తందారి వ్యవస్థపై పోరు చేయకపోతే మన బతుకులు ఇంకా ఇలానే ఉండేవి.
కేసీఆర్ దగ్గరు దొరతనం ఉండోచ్చు.. కానీ దొర గుణం కూడా ఉందని చెప్పాలి. తెలంగాణా ఉన్నంత కాలం.. మూడు అక్షరాల పేరుగల కేసీఆర్.. చరిత్రపూటాల్లో చిరస్థాయి బతికి ఉంటాడు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భావిభారత విద్యార్థులు ఒక జనరల్ నాలేడ్జ్ కొశ్చన్ అవుతాడు. కేసీఆర్ లోటును పూడ్చడం ఎవరితో సాధ్యం కాదనే నేను నమ్ముతాను.
కానీ కేసీఆర్ నమ్మిన సిద్దాంతాలను, తెలంగాణా ప్రయోజనాలను కాపాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీయే.. ఈ పార్టీ ఒకరిద్దరిదో కాదు.. తెలంగానా మట్టిన ప్రేమించే ప్రతి ఉద్యమకారుడిది.. టీఆర్ఎస్ ఐన బీఆర్ఎస్ ఐన.. దాని వాసన మట్టి వాసనే..
తెలంగాణాకు భౌవిష్యత్ నేత, కేసీఆర్ తర్వాత అంత విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారే అని నేను భావిస్తాను.
నాయకత్వ లక్షణాలు, విజ్ఞానం, ఉన్నత చదువు ఉన్న కేటీఆర్ గారు అధికార పాత్రలోనే కాదు ప్రతిపక్ష పాత్రలో కూడా సక్సెస్ అవుతున్నారు. తెలంగాణా ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు.
నేను ఒక జర్నలిస్టుగా కాకుండా.. తెలంగాణాకు ముందు.. తెలంగాణా తర్వాత మన బతుకుల గురించి అభివృద్ది గురించే ప్రస్తావించాను. ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి. బీఆర్ఎస్ 25 ఏండ్ల రజతోత్సవ సభ సందర్బంగా మనసులోని మాటలు నా పేస్బుక్ మిత్రులతో పంచుకోవాలనిపించింది.
నోట్ : ఒకటి మాత్రం నిజం నాకు ఏ పార్టీలత సంబంధం లేదు.. మంచి చేసే నాయకులను మాత్రం అభిమానిస్తాను.. డైరక్ట్ గానే సపోర్ట్ చేస్తాను. మంచిని మంచి చెడును చెడు అంటాను. ఎవరు ఏం అనుకున్న నేను పట్టించుకోను. నా మనసు ఏది చెబితే అదే మాట్లాడుతా. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని బాజాప్తా వ్యక్తపరుస్తా.
జై తెలంగాణా..జై జై తెలంగాణా..

బాలు కాయితి సిరిసిల్ల
సీనియర్ జర్నలిస్టు, రాజన్న సిరిసిల్ల
బలగం టీవీ , సీఈవో.