బలగం టీవీ, ముస్తాబాద్:
- నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక కారు ఆటో సీజ్
- 9 మంది పై కేసు నమోదు
ముస్తాబాద్ మండలంలో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టు పడగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. వారి వివరాల ప్రకారం మండలంలోని రామ లక్ష్మణ పల్లె గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఎస్సై తన సిబ్బంది యుక్తంగా వెళ్లి తనిఖీ చేయగా 13,340/- రూపాయల నగదు తోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు,ఒక కారు, ఆటోను సీజ్ చేసి తొమ్మిది మంది పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.