బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. వారి వివరాలు ప్రకారం మోతే కిరణ్, అతని తండ్రి మోతే ఎల్లయ్య, అతని తల్లి మోతే ఎల్లవ్వ ఇంట్లో ఉన్నారు. మోతె సతీష్, మోతే ఎల్లవ్వ,మోతే బాలమణి లు పాత కక్షలు మనసులో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నాన్న బూతులు తిడుతూ బండరాళ్లతో పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్ కు తో పాటు ఎల్లయ్య, ఎల్లవ్వ లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.