బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల పనిగంటల పెంపు
మే 1న మేడే ఘనంగా నిర్వహించండి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు
బిజెపి పాలిత రాష్ట్రాలలో కార్మికుల పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటున్న తీరును ఖండిస్తూ కార్మిక చట్టాలను రద్దుచేస్తూ నాలుగు లేబర్ కోడులు తీసుకో రావటమే కాకుండా కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ విధానాలపై ఉద్యమం చేపట్టాలని, మే 1న అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం మేడే గ్రామ గ్రామాన వాడవాడల ఎర్రజెండాలు ఎగురవేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం
సిరిసిల్ల బివై నగర్ అమృత లాల్ శుక్ల భవన్లో సిపిఎం జిల్లా స్థాయి సమావేశం జరిగింది. అనంతరం మేడే జయప్రదం చేయాలని కోరుతూ ఆయన కరపత్రాలను విడుదల చేశారు అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు చెంప పెట్టు కావాలని అన్నారు. కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వకపోగా కార్మిక చట్టాలను సవరించి ప్రశించే హక్కును సంఘాలు ఏర్పాటు చేసే హక్కును రద్దు చేస్తున్నారని ధ్వజమెత్తారు
కార్మిక చట్టాలను సవరణ చేస్తే 8 గంటల స్థానంలో 12 గంటల పని దినాలు అమలు అవుతాయని అన్నారు. కార్మికులపై పని గంటలు పెంచి పెట్టుబడిదారులకు ఆదాయాన్ని సమకూర్చడానికి కేంద్రమే లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నదని విమర్శించారు. సవరించిన కార్మిక చట్టాలు అమలులోకి వస్తే సంపద కేంద్రీకరణ పెరుగుతుందని ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు పెరుగుతాయని హెచ్చరించారు.

కార్మిక వర్గం కార్మిక చట్టాల సవరణపై తిరగబడకపోతే కార్మికులు యజమానులు పెట్టుబడిదారులకు బానిసలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు చట్టాలు అమలులోకి వస్తే ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు చట్టాల వల్ల రిజర్వేషన్లు ఎత్తివేస్తారని దీని వల్ల సామాజిక వివక్ష ఇంకా పెరుగుతుందని హెచ్చరించారు. కార్మిక వర్గ ఐక్యత సమరశీల పోరాటాల ద్వారా మాత్రమే కార్మిక చట్టాల సవరణకు ఇన్ని సంత్సరాలుగా కేంద్రం వెనుకడుగు వేసిందని కానీ మళ్ళీ ఇప్పుడు చట్టాల సవరణ కు పార్లమెంటు ఆమోదం ద్వారా మరోసారి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక రకాల సంక్షోభాలను పెడచెవిన పెట్టి కార్మిక చట్టాల సవరణ ద్వారా పెట్టుబడుదారి సేవలో తరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేడే నిర్వహించాలన్నారు. మే 1న అంతర్జాతీయ కార్మిక అష్ట జీవుల దినోత్సవాన్ని గ్రామ గ్రామాన వాడవాడలా ఎర్రజెండాలు ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్ అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమలక్క, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, అన్నల్దాస్ గణేష్, సూరం పద్మ, రమేష్ చంద్ర, వివిధ ప్రజా సంఘాల నాయకులు రామంచ అశోక్, సిరిమల్లె సత్యం, కుమ్మరి కుంట కిషన్, నరేందర్, ఎస్ రాములు, దినకర్, నక్క దేవదాస్, సురేష్, కమలాకర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.