బలగం టీవీ ఎల్లారెడ్డిపేట మార్చి 8
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ సఫై కార్మికులకు బిఆర్ఎస్ మండల యువజన శాఖ నాయకులు చందనం శివరామకృష్ణ గ్రామపంచాయతీ ఆవరణంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిధిలోని ప్రతినిత్యం ప్రజల బాగోగులకు గ్రామ పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా,ప్రజల ఆరోగ్య రిత్యా పనిచేస్తున్న పట్టణ మహిళ కార్మిక సోదరిమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవను గుర్తించి శాలువాతో సత్కరించి,వారికి గ్లౌజులు మాస్కులు అందించారు.
ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మురళీమోహన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షులు ధోనుకుల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.