బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
తేదీ 16-03-2025 రోజున బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నారు.
ఈ సందర్భంగా నేడు సిరిసిల్ల బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాంప్రసాద్ పార్లమెంటు కో- కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, రాజాసింగ్,సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, సిరిసిల్ల ఓబిసి టౌన్ అధ్యక్షుడు అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు, సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు వైశాలి, బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
