బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి హైస్కూల్లో 2007-2008 సంవత్సరం పూర్వపు విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో ఆదివారం రోజున పాల్గొన్నారు. అందరూ ఒక చోట కలుసుకొని ఒకరికి ఒకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు ఏదో స్థాయిలో ఈరోజు ఇలా ఉన్నామని తెలిపారు.ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి హెడ్మాస్టర్ టి.సత్యనారాయణతో పాటు ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తోటి విద్యార్థి కొత్తపేట గ్రామానికి చెందిన కళ్లెం కాశీరాం కూతురుకు క్యాన్సర్ రావడం వలన పూర్వపు విద్యార్థులు అందరు కలిసి 25వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. కాశీరాం కూతురు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున, బూర్గుల మహేందర్, నల్లాల అజయ్ కొండ రోజా వసుంధర మనోహర్ నాగరాజు శ్రవణ్ కుస నాగరాణి వెంకటేష్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.