బలగం టీవీ, మహారాష్ట్ర:
భార్య కన్నీటి వీడ్కోలు
మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్కు ఈనెల 5న వివాహం జరిగింది. అయితే, భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మనోజ్కు వెంటనే బోర్డర్కు తిరిగి రావాలని పిలుపు వచ్చింది. దీంతో పెళ్లయిన మూడు రోజులకే మనోజ్ తిరిగి వెళ్లాల్సి రావడంతో ఆయన భార్య యామిని, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్కు పంపుతున్నా’ అంటూ యామిని కన్నీటితో తన భర్తకు వీడ్కోలు పలికింది. ఈ ఘటన దేశభక్తికి, కుటుంబ బంధానికి ప్రతీకగా నిలిచింది.