బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘసేవ సంస్థ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన “జానపదం మా ప్రాణపదం – గద్దర్ అన్న ఐకాన్ అవార్డు 2025” కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు ఆకునూరి దేవయ్యకు ప్రతిష్ఠాత్మక గద్దర్ అన్న ఐకాన్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని బి ఎం బిర్లా సైన్స్ సెంటర్లో నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అవార్డును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ శ్రీమతి గద్దర్ వెన్నెలెక్క, సాయి అలేఖ్య సంస్థ చైర్మన్ ఉపదృష్ట అరుణ అశోక్, ఉప్పుల శ్రీనివాస్ గుప్తా తదితరలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గద్దర్ అన్న ఐకాన్ అవార్డు 2025 అందుకున్న ఆకునూరి దేవయ్యకు జిల్లాలోని కళాకారులు ఎడమల శ్రీధర్ రెడ్డి, కమ్మరి తిరుపతి, లక్ష్మి నారాయణ తదితరులు అభినందనలు తెలిపారు.
