ప్రభుత్వ నిషేధిత చైనా మాంజా ను ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
సంక్రాంతి పండుగకు గాలి పటాల తో పాటు పక్షులను ఎగరనిద్దామని చైనా మాంజా తో తలెత్తే అనర్థాల పై అందరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు అన్నారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే గాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని అన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని ఈ యొక్క చైనా మాంజా ను నిల్వచేసిన, రవాణా చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ యొక్క చైనా మాంజా ను ఎవరైనా తయారు చేసిన లేదా, అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని డయల్ 100 గాని ఫోన్ చేసి తెలపాలి అని సూచించారు.