బలగం టీవీ, హైదరాబాద్ :
చీటింగ్ కేసులో అఘోరీ అలియాస్ శ్రీనివాస్ కు ఈరోజు (బుధవారం) చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ క్రమంలో అఘోరీని కంది సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే అఘోరీని ఏ బారక్లో ఉంచాలో జైలు అధికారులకు అర్ధం కాకపోవడంతో.. అఘోరీకి లింగ నిర్థారణ జరగకుండా జైలులో ఉంచుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో అఘోరీని తిరిగి కోర్టుకు తీసుకెళ్లగా.. లింగ నిర్థారణ పరీక్షకు న్యాయస్థానం ఆదేశించింది.