బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా శాఖ 4వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షులుగా అవురం సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వంగ తిరుపతి ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి తెలిపారు. ఎన్నికల పరిశీలకుడిగా లింగారెడ్డి, ఎన్నికల అధికారిగా రాజిరెడ్డి వ్యవహరించారు. కౌన్సిల్ సభ్యులందరి ఆమోదంతో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైందని వారు ప్రకటించారు. ఈ సమావేశం సుదీర్ఘంగా నిన్న ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగింది.

నూతనంగా ఎన్నికైన DTF రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ వివరాలు: అధ్యక్షులుగా అవురం సుధాకర్ రెడ్డి (MPPS నారాయణపూర్), ప్రధాన కార్యదర్శిగా వంగ తిరుపతి (MPPS ఎన్గల్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా MD. సలావుద్దీన్ (ZPHS నెహ్రు నగర్), M. సుజాత (ఎంపీపీస్ రాగట్లపల్లి), T. సురేష్ (MPPS తారకరామనగర్) ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా M. విష్ణుప్రసాద్ (MPUPS అక్క పల్లి), కారంపూరి రాజేశం (Mpps మండెపల్లి), M. చక్రపాణి (mpps కోనాయిపల్లి), ఆడెపు గణేష్ (ZPHS ఆవునూరు) ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా A. రాజేశ్వర్ రావు, Y. ఉమారాణి, బూర సదానందం, A. శంకర్, దొంతుల శ్రీహరి, గుర్రం కృష్ణారెడ్డి, R. రామేశ్వర్ రెడ్డి, ఎర్రసత్యనారాయణ, గడ్డం లక్ష్మారెడ్డి, ఆడెపు రాజేశం, R. నర్సయ్య ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్గా గంప రాజేందర్, సభ్యులుగా CH. రవిందర్, M. ఎల్లయ్య ఎన్నికయ్యారు. అకడమిక్ సెల్ కన్వీనర్గా G. కృష్ణారెడ్డి, సభ్యులుగా V. ప్రేమ్ సాగర్, Ch. అరుంధతి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పలు ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించింది. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి తరగతికి ఒక గదిని మరియు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని తీర్మానించారు.