బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) అనుబంధ సంస్థ అయిన ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఈ రోజు బషీర్ బాగ్, హైదరాబాద్ లోని యూనియన్ కార్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులు ప్రధానం చేసింది. సుప్రసిద్ధ హైదరాబాది ఉర్దూ పాత్రికేయులు ఫైజ్ మహ్మద్ అజ్గర్, తబస్సుమ్ ఫరీది, హబీబ్ అలీ జిలాని, రహీంల పేరిట ఈ స్మారక అవార్డులను 8మంది సీనియర్ ఉర్దూ జర్నలిస్టులకు ప్రధానం చేసింది. ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.ఏ. మాజీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు 150మంది ఉర్దూ జర్నలిస్టులు పాల్గొన్నారు.
