ఓటు హక్కు నమోదుఫై అవగాహన

0
153

–స్వీప్ ఆద్వర్యంలో శిక్షణ

బలగం టివి,  సిరిసిల్ల:

గ్రామాలు, పట్టణాల్లో 18 ఏండ్ల వయస్సు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని డీఈఓ రమేశ్ కుమార్ అన్నారు.
ఓటు హక్కు నమోదుఫై స్వీప్ ఆద్వర్యంలో శుక్రవారం. జిల్లా సమీకృత సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూల్స్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వ్యవసాయ, నర్సింగ్, ఐటీఐ కళాశాలల నుంచి విద్యార్థులను క్యాంపస్ అంబాసిడర్ లాగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వోటర్ హెల్ప్ లైన్ యాప్ లో అందుబాటులో ఉన్న సేవలు, ఓటు హక్కు నమోదుకు అర్హత వయసు, ఆన్లైన్, ఆఫ్ లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి, ఫారం నెంబర్ 6,7,8 వినియోగం, ఓటు హక్కు నమోదులో తరచూ చేసే తప్పులు ఎలా నివారించాలి తదితర అంశాల ఫై వివరించారు.ఈ కార్యక్రమంలో
ఏపీడీ (నోడల్ ఆఫీసర్) నరసింహులు, డీఎంఎల్టీ మహేందర్ రెడ్డి అధికారులు రెహమాన్, బీఎల్ఓలు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here