బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
-ఎస్పీ మహేష్ బి గితే
మత్తు పదార్థాలు,సైబర్ నేరాలపై గ్రామాల్లో ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.
మంగళవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి పోలీస్ స్టేషన్లను ఎస్పీ మహేష్ బి గితే సందర్శించినారు. స్టేషన్ల పరిసరాలు, పలు స్టేషన్ రికార్డులు, పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల వివరాలతో పాటు గతంలో జరిగిన సంఘటనల వివరాలు, స్టేషన్ల పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలతో పాటుగా సిబ్బంది నిర్వహించే విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యారుదలపై తక్షణమే స్పందించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని, చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని అన్నారు.పెట్రోలింగ్ సమయంలో తప్పని సరిగా రౌడీ, హిస్టరీ షీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల తనిఖీ చేస్తూ వారి ప్రస్తుత స్థితిగతులపై అరా తీయాలని, మత్తు పదార్థాలపై, సైబర్ నేరాలపై ముమ్మరంగా గ్రామాల్లో ప్రజలకు, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు. అధికారులకు, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అని సూచించారు.
ఈ కార్యక్రమం లో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐలు రమాకాంత్, ఎల్లగౌడ్, సిబ్బంది ఉన్నారు.