బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రియాంక మిస్సింగ్ ఘటన సుఖాంతమైంది. కడప ప్రాంతంలో ఆమె తన తండ్రి రాజేశం, కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ ఘటనపై స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అధికారులు తదుపరి విచారణ జరుపుతున్నారు.