బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు (సెమినార్) అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ దళిత మోర్చ కార్యదర్శి ఎస్ కుమార్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ని అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివదేహాన్ని తరలించి, ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లులు చెల్లించాలని అంబేద్కర్ సతీమణి కి బిల్లులు పింపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు, ఆయన ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తోంది. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు, దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము గార్లను రాష్ట్రపతి చేసింది. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు భారతరత్న కోసం బిజెపి కృషి చేసింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్ లో చోటు కల్పించింది. అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కుమ్మరి శంకర్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, అల్లాడి రమేష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్ ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ యాదవ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ ఆడెపు రవీందర్, సిరిసిల్ల మరియు వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, మరుత సత్తయ్య జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, సంతోష్ రెడ్డి అంబేద్కర్ జయంతి ఉత్సవాల కన్వీనర్ మరియు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చంటి మహేష్ కో కన్వీనర్ కొంపెల్లి రాజేందర్, యాదగిరి, ఎస్టి మోర్చా అధ్యక్షుడు కోనేటి సాయిల్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, బిజెపి మహిళా నాయకురాలు పల్లం అన్నపూర్ణ, వివిధ మండలాల అధ్యక్షులు మండల కన్వీనర్లు కో కన్వీనర్లు, బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.