బీజేపీ జెండాను ఆవిష్కరించిన వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి, బీజేపీ రాష్ట్ర నాయకులు వికాస్
బలగం టీవీ, వేములవాడ :
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం గుర్రంవానిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర నాయకులు డా.చెన్నమనేని వికాస్ బీజేపీ జెండాను మంగళవారం రోజున ఆవిష్కరించినారు. అనంతరం గ్రామంలో బీజేపీ పార్టీలోకి చేయడంతో వారికి కండువా కప్పి ఆహ్వానించినారు.

డాక్టర్ వికాస్ మాట్లాడుతూ.. ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణలో బిజెపి విజయం సాధిస్తుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతపల్లి వెంకటేశ్వర రావు, రాకేష్, సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి, ప్రశాంత్, నర్సింగోజు శంకర్, ఉపాధ్యక్షులు జింక శ్రీనివాస్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సంతోష్ యాదవ్, నాయకులు జింక అనిల్, గుండెకర్ల లక్ష్మణ్, చొక్కాల మధు, చెర్ల దేవరాజు, ఆంజన్న యాదవ్, ముదం శ్రీనివాస్, గణేష్, పేరంగాని మల్లేశం, బొల్లు తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
