బలగం టీవీ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ మన్కీబాత్ కార్యక్రమం బిజెపి నాయకులు కార్యకర్తలు వీక్షించినారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మనసులో మాట ‘మన్కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోవడం ఒక శుభ పరిణామం అని, దేశ అభివృద్ధి అంశాలను ప్రధాని నేరుగా ప్రజలకు వివరించే ఈ కార్యక్రమం ఎంతో ప్రభావవంతంగా మారిందన్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో దేశ భద్రత మరియు అభివృద్ధి అంశాలపై ప్రధాని ప్రజలతో ముచ్చటించారు. అందుకే దేశ ప్రజలందరూ ప్రతి నెల చివరి ఆదివారం జరగే ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు రవీందర్ రెడ్డి, ఎట్టెపు కనకయ్య, మండల ప్రధాన కార్యదర్శి రెండ్ల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు ఓడ్నాల రాజు, బూత్ అధ్యక్షులు బండ అనిల్ కుమార్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.