బలగం టీవీ, తంగళ్లపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బీఆర్ఎస్ బీసీ సెల్ మాజీ అధ్యక్షులు చిలుక రఘువర్మ బుధవారం రాత్రి ఆనారోగ్యంతో మృతి చెందారు. రఘు 2009 నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేశారు. చిలుక రఘు ఆనారోగ్య సమస్యలతో లావు పెరిగి.. ఆస్పత్రి పాలయ్యారు. రఘు కు భార్య, కుమారుడు ఉన్నారు. రఘు చిన్న వయస్సులో అసువులు బాయడం బాధాకరమైని తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రఘు మృతి పట్ల బీఆర్ఎస్ మండల నాయకులు సంతాపం ప్రకటించారు.