మార్పు కోరుకున్న తెలంగాణ సమాజం.నిరంకుశ పాలన నుండి ప్రజా పాలన వైపు..
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ.
బలగం టివీ,తంగళ్లపల్లి::
మంత్రి పోన్నం ప్రభాకర్ ను విమర్శించే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదు అని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఓర్వలేని కేటీఅర్ పార్టీ శ్రేణుల ద్వారా మంత్రి పోన్నం పై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలనీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలెకర్ల సమవేశంలో మాట్లాడుతూ కొత్తగా ఎర్పడిన తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఒక బీసీ నాయకుడు ,కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు ,బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందన సభలో కార్యకర్తలపై ఉన్న చనువుతో ప్రేమ అభిమానాలు కురిపిస్తూ వేదికపై కార్యకర్తలను ఉద్దేశించి సూచనలు చేస్తు,గత ప్రభుత్వ,దోపిడీ, నిరంకుశ పాలన వల్ల ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం గురించి వివరిస్తున్నా క్రమంలో కొంతమంది బిఆర్ఎస్ నాయకులు వక్రీకరించుకుంట సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ ను మండల కాంగ్రెస్ పార్టీ పక్షానఖండిస్తున్నామని అన్నారు.కేసీఆర్,కేటీఆర్ దోపిడీని,దొరతనాన్ని ప్రశ్నించే లేని బీఅర్ఎస్ నాయకులు , పొన్నం పై విమర్శలు,తప్పుడు ప్రచారాలు చేయడం తగదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు ఆపకపోతే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పక తప్పదు అంటూ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు