బలగం టీవీ, హైదరాబాద్ :
- మంగళవారం అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
- బీఆర్ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలి.
అధినేత కేసీఆర్ అధ్యక్షతన దాదాపు మూడు గంటల పాటు సాగిన ఎల్పీ సమావేశం పలు అంశాలను చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సమావేశంలో నిర్ణయించమని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లడుతూ.. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని బిఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలని రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు….ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరత పై అసెంబ్లీ లో మండలి లో పోరాడాలని అన్నారు.
బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని రాష్ట్రం లో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరు పై మాట్లాడాలని ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్… డిఎ ల పెండింగు, పీఆర్సీ అమలు పై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని మహిళలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని కొట్లాడాలని, ఆరు గ్యారంటీ ల అమలు లో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని అన్నారు.
విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు విడుదలచేయక పోవడం గురించి,వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, తదితర ప్రహజసమస్యలపై ఎండగట్టాలని,దళిత బంధును నిలిపివేయడం పట్ల ప్రశ్నించాలని గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం అసెంబ్లీ మండలి లో ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బి ఆర్ ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పశ్నించాలని అధినేత కేసీఆర్ నేటి సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజా సమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.
బిఆర్ఎస్ అధినేత అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా, శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొన్నారు.