సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ను మరోసారి అత్యధిక మేజార్టీతో గెలిపించుకోవాలని జిందం చక్రపాణి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్యలు సిరిసిల్ల పట్టణ మహిళ అధ్యక్షురాలు బత్తుల వనజలు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.


