బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు-శశికలమ్మ పెళ్ళిరోజు వేడుకలు కరీంనగర్ లోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా బోయినిపల్లి మండల నాయకులు పూల బొకెలు ఇచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన నివాసంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, జిల్లా నాయకులు అనుముల భాస్కర్, మాజి జెడ్పిటిసి కొనకటి లచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య,గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, చిందం రమేష్, ముద్దం రవి, నల్లగొండ అనిల్ కుమార్, అహ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.