బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ భవన్ నేడు రాజకీయ సందడితో నిండిపోయింది. బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన BRSLP (బిఆర్ఎస్ శాసనసభాపక్షం) మరియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కీలక నాయకులు భారీగా తరలివచ్చారు.
