బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
వేములవాడ నియోజకవర్గంలోని సంకెపెల్లి, కొడుముంజ గ్రామాల్లోని అమ్మవార్లను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు దర్శించుకున్నారు. సంకెపెల్లి గ్రామంలో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “చౌడాలమ్మ” ఆలయంలో, కొడుముంజ గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ప్రతిష్టించిన “పెద్దమ్మ తల్లి” ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ సర్పంచ్ వెంకట రమణ రావు, బూర బాబు, నీలం శేఖర్, గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మణ్, అభిమన్యు యాదవ్, రెడ్డవేని పరుశురాం, అభిలాష్, సాయి గౌడ్, గుండెకార్ల నరేష్, బుచ్చయ్య, ముదిరాజ్ కులస్తులు రేగుల పరశురాం, దినగల పరుశురాం, రేగుల మల్లేశం, చంద్రం, వేణుగోపాల్ రావు, బండారి శ్రీనివాస్, పరశురాం, రాము గౌడ్, మహేష్ యాదవ్, జింక్ శ్రీధర్, ఎల్లయ్య, బాలయ్య, మరవేణి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.