బలగం టీవి, వేములవాడ:
కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త నన్నసాయబు భార్య ఇటీవల క్యాన్సర్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను గురువారం బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ బండ నర్సయ్య, రామ్మోహన్ రావు సీనియర్ నాయకులు రాఘవ రెడ్డి, చంద్రయ్య గౌడ్, కదిరే శ్రీనివాస్, ప్రతాప రెడ్డి, దొంతరవేణి శ్రీనివాస్, తిరుపతి, ప్రవీణ్, రాములు నాయక్, శివతేజ తదితరులు పాల్గొన్నారు.