బలగం టీవి, వేములవాడ:
వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన కప్పల వంశీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు గురువారం బాధితుడిని పరామర్శించారు. వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో సెస్ డైరక్టర్ హరిచరణ్ రావు, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, పలువురు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.