బలగం టీవీ, హైదరాబాద్:
హైదరాబాద్లో ఈ నెల 8న హైడ్రా స్పెషల్ PSను CM రేవంత్ ప్రారంభించనున్నారు. రాణిగంజ్లోని బుద్ధభవన్ను ఆనుకుని ఉన్న భవనంలోని 2 అంతస్తుల్లో PS ఉండనుంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడే క్రమంలో భూములు కబ్జాలకు, ఆక్రమణకు గురైనట్లు నిర్థారించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇందుకు బాధ్యులైన వారిపై అమీన పూర్, శేరిలింగంపల్లి తదితర PSలలో ఇప్పటి వరకు నమోదైన 48 కేసులు హైడ్రా PSకు బదిలీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది.