బలగం టీవీ, వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరం MLTలో హేమంత్ (496/500) రాష్ట్ర మొదటి ర్యాంకు, LMDTలో ఆదిల్ షరీఫ్ (483/500) రాష్ట్ర రెండవ ర్యాంకు సాధించారు. రెండవ సంవత్సరంలో LMDTలో MD. షారుక్ (969/1000), MLTలో P. సంజయ్ (962/1000) రాష్ట్ర ర్యాంకులు పొందారు. అలాగే, 31 మంది విద్యార్థుల్లో 16 మంది 900కు పైగా మార్కులు సాధించారు. ఈ విద్యార్థులు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతితో కలిసి బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిశారు. కలెక్టర్ వారిని అభినందించి, లక్ష్యాల సాధనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిన ప్రిన్సిపాల్ P. లక్ష్మినారాయణ, లెక్చరర్లు, సహోపాధ్యాయులను కూడా కలెక్టర్ ప్రశంసించారు.