బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదలకాగా, వేములవాడ లోని మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన MLT మొదటి సంవత్సరంలో హేమంత్ 500కి గాను 496 సాధించి రాష్ట్ర మొదటి ర్యాంక్, LMDT మొదటి సంవత్సరంలో ఆదిల్ షరీఫ్ కి 500కి 483 సాధించి రాష్ట్ర రెండవ ర్యాంకులు సాధించారు. రెండవ సంవత్సరం లో LMDT లో MD. షారుక్ 1000కి 969, MLT లో P. సంజయ్ 1000 కి 962 తో రాష్ట్ర ర్యాంకులు సాధించారు. వీటితో పాటు రెండవ సంవత్సరం లో 31 కి గాను 16 మంది విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా ఆ విద్యార్థులు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతితో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బుధవారం కలువగా, వారిని అభినందించారు. వారు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులను రాష్ట్ర ర్యాంకర్లు గా తీర్చిదిద్దిన గురుకులం అని TGMRS JC ప్రిన్సిపాల్ P. లక్ష్మినారాయణ, లెక్చరర్లు, సహోపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.
