బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- జిల్లా విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్
పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, వారిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. పదో తరగతి ఫలితాలు బుధవారం వెలువడగా, జిల్లాకు చెందిన వివిధ విద్యాలయాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, వారిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించి, సన్మానించారు అలాగే జిల్లా నుంచి పీ వర్షిణి 591/600 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలువగా, కలెక్టర్ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో ఆయా విద్యాలయాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

