బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ముస్తాబాద్ మండలం కొండాపూర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎప్పటికప్పుడు తూకం వేయాలని, ధాన్యం తరలించడానికి అందుబాటులో సరిపడా వాహనాలు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందకుండా అధికారులు, నిర్వాహకుల సూచనలు పాటించాలని కలెక్టర్ అన్నారు.
