బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదివి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామ యువ నాయకులు అభినందించడం జరిగింది.
ఈ సంధర్భంగా యువ నాయకులు జంగా రాజుగారు మాట్లాడుతూ మీరు ఇలాగే చదివి ఉన్నత శిఖరాలను చేరాలని కోరారు. తోట ధర్మేందర్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నుండి ఇంత మంచి మార్కులు పొందడం అభినందనీయమన్నారు. కావటి మహిపాల్ మాట్లాడుతూ భవిష్యత్తులో మీకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వంగపల్లి హారిక 552, లకావత్ గణేష్ 536, మాచర్ల శరణ్య 530, చేపూరి వర్ష 530, బాలిగారి వైష్ణవి 524, గీస వైష్ణవి 515, మెతుకు వర్షిని 504, రాగుల చరణ్ 511, రాచర్ల శివ సాయి 518 మార్కులు సాధించారు.
ఈ కార్యక్రమంలో జంగరాజు, కావటి మహిపాల్, తోట ధర్మేందర్, బొబ్బిలి రాజశేఖర్, వంగపెల్లి వెంకటేష్, శ్రీను, ఉపాధ్యాయులు భూపతి, రాజిరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.