బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ లో భూభారతి కార్యక్రమాన్ని స్థానిక తహసిల్దార్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్యఅతిథిగా పిలిచారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సబేరా బేగం భర్త గౌస్ స్టేజి పైన కుర్చీలో ఎలా కూర్చుంటడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రోటోకాల్ ఉల్లంఘించిన తీరును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పందిర్ల లింగం ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడే ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.