బలగం టివి, ఎల్లారెడ్డిపేట
గత ప్రభుత్వంలో కృష్ణ జలాలను దోపిడీ చేసి తెలంగాణ ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేసిందని జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కెసిఆర్ నల్లగొండ కృష్ణా జలాల మీద బహిరంగ సభ ను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర కిసాన్ సెల్ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో సోమవారం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని మర్రి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు పాల్గొన్నారు.