-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, వేములవాడ:
అత్యాధునిక పద్ధతుల్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన సత్రం నిర్మిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
శృంగేరి పర్యటనలో భాగంగా సోమవారం కొల్లూరు మూకాంబిక అమ్మవారినీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కొల్లూరు మూకాంబిక అమ్మవారి సన్నిధిలో నిత్య అన్నదాన సత్యాన్ని,వంటశాల, డైనింగ్ హాల్, క్యూలైన్లను అది శ్రీనివాస్ పరిశీలించారు.. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి పోన్నం ప్రభాకర్ చొరవతో శ్రీ రాజరాజేశ్వర స్వామి అన్నదాన సత్రం నిర్మాణం కోసం 35 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. గత సంవత్సరం నవంబర్ 20 న శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన అభివృద్ధి విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అన్నదాన సత్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. రొజు రోజుకు పెరుగుతున్న రాజన్న భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణం చేపట్టడం కోసం ఇప్పటికే టెండర్లు పూర్తయి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఇక్కడ ఆలయ ఈవో వినోద్ రెడ్డి,ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, అర్చకులు శరత్, సురేష్, శర్మ,ఏఈ రామకిషన్ రావు తదితరులు ఉన్నారు.