బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న
వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండా, శాంతినగర్, మద్దిమల్ల బహ్హౌసింగ్ నాయక్ తండా గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ప్రమాదంలో గాయపడిన వారిని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.


నూతన దంపతులకు ఆశీర్వాదం
శాంతినగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త జుంకీలాల్ కుమారుని వివాహానికి హాజరై నూతన దంపతులను తోట ఆగన్న ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వీర్నపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
