బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి లౌకుష్ యాదవ్
రిజిస్టర్ గుర్తింపు లేని పార్టీల నివేదిక పై జిల్లా ఎన్నికల అధికారులతో రివ్యూ నిర్వహణ
ఏప్రిల్ 28 నాటికి రిజిస్టర్ గుర్తింపు లేని పార్టీల వివరాలు అందించాలని భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి లౌకుష్ యాదవ్ అన్నారు. గురువారం భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి లౌకుష్ యాదవ్ రిజిస్టర్ గుర్తింపు లేని పార్టీల నివేదిక పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పాల్గోన్నారు.
ఈ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి లౌకుష్ యాదవ్ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకుని గుర్తింపు పొందని రాజకీయ పార్టీ వివరాలను జిల్లా ఎన్నికల అధికారులు సేకరించి ఏప్రిల్ 28 నాటికి భారత ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని సూచించారు.
రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలను మినహాయించి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో జిల్లా ఎన్నికల అధికారులకు ఏప్రిల్ 22 న రిజిస్టర్ చేసుకుని గుర్తింపు లేని రాజకీయ పార్టీల వివరాల సేకరణ గురించి మార్గదర్శకాలు జారీ చేశామని, వాటిని తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకుని గుర్తింపు లేని రాజకీయ పార్టీల అధ్యక్షులకు సమాచారం అందించి ఎన్నికల కమిషన్ నిర్ణీత నమూనా ప్రకారం పార్టీ సంబంధిత వివరాల రిపోర్టు సంతకంతో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
మన దగ్గర ఉన్న వివరాల ప్రకారం గుర్తింపు లేని రాజకీయ పార్టీల అడ్రస్ లో సంబంధిత పార్టీ లేని పక్షంలో ఆ వివరాలను కూడా అందించాలని అన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత ఎన్నికల అధికారులు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.