బలగం టీవీ, హైదరాబాద్:
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సంజయ్ కుమార్ పార్టీ మారారనడానికి ఎలాంటి పక్కా ఆధారాలు లేవని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలు అనర్హత వేటు వేయడానికి సరిపోవని స్పష్టం చేశారు.
