- గొల్ల,కురుమల ఆందోళన…
గంభీరావుపేట :
రెండో విడిత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టలని చేయాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండలం లింగన్న పేట గ్రామంలో గొల్ల, కురుమల ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ లింగన్నపేట లో 61 మంది గొల్ల, కురుమలు రెండో విడత గొర్రెల పంపిణీ కోసం డీడీలు తీసి ఆరు నెలలు అయినదనీ అన్నారు.గత ప్రభుత్వం, మాజీ మంత్రి కేటీఆర్ నిర్లక్ష్య ధోరణి వల్ల గొర్రెల పంపిణీ జరగలేదని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను పట్టించుకోని న్యాయం చేయాలని, 15 రోజుల్లో గొల్ల,కురుమల గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో గొల్ల,కురుమలకు రూ. 2లక్షలు, గొల్ల కుర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినదాని, ఇచ్చిన హామీ నీ వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.