బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
మండేపల్లి గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో మండేపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులైన జగ్గాని సాహితి మహేష్కు రూ.60,000, పన్యాల సాత్విక మైపాల్కు రూ.21,000 చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఎంపీటీసీ బుస్స స్వప్న లింగం, మాజీ సర్పంచ్ తంగళ్లపల్లి దేవయ్య, రాగిపెల్లి కిష్టారెడ్డి, గుర్రం కిషన్ గౌడ్, తంగళ్లపల్లి మహేష్, పెద్ది రఘు, పెద్ది పర్శరాములు, నెబూరి రాము, అమరగొండ ప్రశాంత్, ప్రభుదాస్, పెద్ది రాజు తదితరులు పాల్గొని చెక్కులను లబ్ధిదారులకు అందించారు.