బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
పదవ తరగతి లో తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు గాను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. ఎం.అక్షయ 573, కె ప్రణయ్ 560, బి శ్రీవిద్య 560, టి సిరి 559, హర్ష వీణ 551,గౌతమి 550 మార్కులు సాధించినందుకు గానూ కలెక్టర్ అభినందిస్తూ ఐఐటి నీట్ లక్ష్యంగా కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం.విఠల్, ఉపాధ్యాయులు ఆర్ రమేష్, మొహమ్మద్ హనీఫ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.