బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించినందుకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వారికి ఘనంగా సన్మానం చేశారు. విద్యార్థులను పదవ తరగతి ఫలితాలలో స్కూల్ టాపర్లు గా నిలిచిన K. మనీషా 546 మార్కులు, హలీమా 544 మార్కులు, K. రోజా 529 మార్కులు, MD. మైస 528 మార్కులు ,SK. సుగ్రం 525 లను జిల్లా కలెక్టర్ శాలువా, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది మేధావులు సమాజంలో అనేక రంగాల్లో ఉన్నారు. మీరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి ఆఫీసర్లు స్థిరపడి, తల్లిదండ్రులకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు. ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కృషిచేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.