బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇతర నిర్మాణాలు స్థానిక అవసరాల కోసం గుర్తించిన నూతన ఇసుక రీచ్ లపై సమావేశం నిర్వహించారు.జిల్లాలో నూతన ఇసుక రీచ్ ల కోసం వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో పలు ఇసుక రీచ్ లు పరిశీలించగా.. దానిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మైనింగ్, నీటి పారుదల, భూగర్భ, వ్యవసాయ శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ (డీ ఎల్ ఎస్ సీ) సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మైనింగ్ శాఖ ఏడీ క్రాంతి కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, నీటి పారుదల శాఖ, భూగర్భ జల శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
