బలగం టీవీ, హైదరాబాద్ :
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేయోభిలాషులు, నేతలు, సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తున్నారు.
ఇటీవల ఎల్కాతుర్తిలో జరిగిన భారీ బహిరంగ సభకు పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. తాజాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కలిసి రూ. 6 లక్షల విరాళం అందజేశారు. అలాగే, వన్ సాఫ్ట్ సిస్టమ్స్ అధినేత సుభాష్ రూ. 1 లక్ష విరాళం ప్రకటించారు.
పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున విరాళాలు వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
